Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఐచర్ వాహనం ఢీకొని ముగ్గురు మృతి
కురుగుంట దగ్గర లారీని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి.
- bheemraj
- Updated on- December 17, 2023 / 08:41 AM IST
road accident
Anantapur Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కురుగుంట దగ్గర లారీని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
హైదరాబాద్ ఎల్ బీ నగర్ లోని చింతలకుంటలో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న మరో కారును బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ పరార్ అయ్యాడు.
