Rain in Costa, Rayalaseema : దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే విధంగా మధ్య భారతంలో మరో ఆవర్తనం ఉంది. వీటికి తోడు రోజురోజుకూ వేసవి తీవ్రత పెరుగుతుండడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. బంగాళాఖాతం మీదుగా కోస్తా, రాయలసీమపైకి తేమతో కూడిన గాలులు వీస్తుండడంతో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న నాలుగు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కర్నూలులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రత నమోదయ్యింది.
Read More : Sonu Sood: ఆదుకొమ్మని మెహర్ రమేష్ ట్వీట్… అక్కర తీర్చిన సోనూసూద్