Gold
Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది. దీంతో తులం బంగారం ధర మళ్లీ లక్షకు చేరువైంది. మరోవైపు వెండి ధర సైతం భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి.
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 2400 పెరగ్గా, 22 క్యారట్ల బంగారంపై రూ. 2200 పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 3వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్స్ గోల్డ్ పై 22 డాలర్లు పెరిగింది. దీంతో బుధవారం ఔన్స్ గోల్డ్ 3,304 డాలర్ల వద్ద ట్రేడవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,420కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,570కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 89,200 కాగా.. 24క్యారెట్ల ధర రూ.97,420కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000 కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,11,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.