Gold Price Today: బంగారం, వెండి కొంటున్నారా? ధరలు ఎంతగా పెరిగాయో తెలుసా?
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర నిన్న ఇదే సమయానికి రూ.80,700గా ఉండగా, రూ.300 పెరిగి ఇవాళ..
- T Venkateshwarlu
- Updated on- December 29, 2023 / 08:41 AM IST
Gold Price Today
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి రూ.58,500గా ఉండగా రూ.400 పెరిగి ఇవాళ రూ.58,900గా కొనసాగుతోంది.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.63,820గా ఉండగా, ఇవాళ ఉదయం 6 గంటలనాటికి రూ.64,250గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర నిన్న ఇదే సమయానికి రూ.80,700గా ఉండగా, రూ.300 పెరిగి ఇవాళ రూ.81,000గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,650గా ఉండగా, రూ.400 పెరిగి ఇవాళ ఉదయం 6 గంటల నాటికి రూ.59,050కి పెరిగింది. కిలో వెండి ధర నిన్న రూ.79,200గా ఉండగా, ఇవాళ ఉదయం 6 గంటల నాటికి రూ.300 పెరిగి 79,500కు చేరింది.
Dense fog : ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చలి…కమ్ముకున్న పొగమంచు
