Gold and Silver Latest Prices : బంగారం కొనుగోలుదారులకు ధరలు బిగ్షాక్ ఇచ్చాయి. గతవారం రోజులుగా వరుసగా తగ్గుకుంటూ వస్తున్న బంగారం ధరల్లో శుక్రవారం భారీగా పెరుగుదల చోటుచేసుకుంది. 10గ్రాముల బంగారంపై రూ. 310 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే కిలో వెండిపై రూ. 800 పెరుగుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,160 వద్దకు చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,050 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,310.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,900 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 63,160.
చెన్నైలో 10గ్రాముల బంగారంపై రూ. 250 పెరిగింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,400 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,710గా నమోదైంది.
పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధర పెరిగింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.76,200గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 76,200 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.74,500 కాగా, బెంగళూరులో కిలో వెండి రూ.71,850 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.