Gold Rate Today
Gold Rate today : బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. ఇవాళ గోల్డ్ రేటు పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది. మంగళవారం గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ ఇవాళ పెరిగాయి.
ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.760 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.700 పెరిగింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 10డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,957డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు.. వెండి ధర కూడా పెరిగింది. మంగళవారం కిలో వెండిపై రూ.5వేలు తగ్గగా.. ఇవాళ కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,11,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,21,580కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,21,730కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,11,450కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,21,580కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,66,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,51,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,66,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.