Maruti Car Prices : మిడిల్ క్లాస్‌కు మళ్లీ దెబ్బ.. జూన్ 1 నుంచి మారుతి కార్లు కొనడం కష్టమే..

Maruti Car Prices : మారుతి సుజుకి కార్ల ధరలను భారీగా పెంచాలని కంపెనీ నిర్ణయించింది. జూన్ ఒకటో తేదీ నుంచి అన్ని మారుతి కార్ల ధరలు రూ. 30వేల వరకు పెరగవచ్చని కంపెనీ లేటెస్ట్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది.

Maruti Car Prices

  • భారీగా పెరగనున్న మారుతి కార్ల ధరలు
  • జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు
  • అన్ని మోడళ్ల ధరలు రూ. 30వేల వరకు పెరిగే ఛాన్స్

Maruti Car Prices : మారుతి కారు లవర్స్‌కు బిగ్ షాకింగ్ న్యూస్.. వచ్చే జూన్ 1వ తేదీ నుంచి మారుతి సుజుకి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ఆటో ఇండస్ట్రీ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి కార్ల ధరలు ఏకంగా రూ.30వేల వరకు (Maruti Car Prices) పెరగనున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రతికూల ధరల వాతావరణం కారణంగా అన్ని మోడళ్ల ధరలను రూ. 30వేల వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ధర రూ. 30వేల వరకు పెరగొచ్చు :
మారుతి సుజుకి ఇండియా, జూన్ 2026 నుంచి పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్ల ధరలను రూ. 30వేల వరకు పెంచనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గత కొన్ని నెలలుగా ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ ఆ ఫైలింగ్‌లో పేర్కొంది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా అన్ని మోడళ్ల ధరలను పెంచక తప్పడం లేదని తెలిపింది.

Read Also : OnePlus 10 Pro 5G : అద్భుతమైన డిస్కౌంట్.. రూ. 67వేల వన్‌ప్లస్ 5G ఫోన్ జస్ట్ రూ.39,066కే.. DSLR రేంజ్ కెమెరా అదుర్స్!

నివేదిక ప్రకారం.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ప్రస్తుతం అధిక స్థాయిలో ఉన్నాయని మార్కెట్ ప్రతికూల వ్యయ వాతావరణాన్ని ఎదుర్కొంటోందని కంపెనీ కంట్రోలింగ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ పెరిగిన ఖర్చులలో కొంత భాగాన్ని కంపెనీ మార్కెట్‌కు బదిలీ చేయనుంది. అంతేకాదు.. వినియోగదారులపై ప్రభావాన్ని కనిష్టంగా ఉంచేందుకు కంపెనీ కృషి చేస్తోంది.

ప్రస్తుతం, కంపెనీ ఎంట్రీ లెవల్ ఎస్-ప్రెస్సో నుంచి ప్రీమియం యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు ధర రూ. 3.49 లక్షల నుంచి రూ. 28.7 లక్షల మధ్య ఉంది. గత ఏడాది కొత్త జీఎస్టీ రేటుతో కంపెనీ S-ప్రెస్సో ధరను రూ. 1,29,000 వరకు తగ్గించింది. అప్పుడే కంపెనీ ఇతర మారుతి కార్లలో ఒకటైన ఆల్టో K10 ధరను రూ. 1,07,600 పెంచింది. మారుతి సెలెరియో ధరను రూ. 94,100 వాగన్-R ధరను రూ. 79,600కు పెంచింది.

జూన్ 1వ తేదీ నుంచి ఈ వాహనాలన్నిటి ధరలు రూ. 30వేల వరకు పెరగనున్నాయి. అయితే, ప్రతి మోడల్‌కు ఎంత ధర పెరుగుతుందో కంపెనీ ఇంకా కచ్చితంగా వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో కంపెనీ అన్ని కార్ల కొత్త ధరలను ప్రకటించే అవకాశం ఉంది.