PM Kisan Yojana : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2వేలు విడుదల చేస్తోంది. చివరి 19వ విడత ఫిబ్రవరి 2025లో వచ్చింది. ఇప్పుడు 20వ విడత జూలై 2025లో విడుదల చేస్తారని భావిస్తున్నారు.
లబ్ధిదారుల జాబితాలో పేరును ఎలా చెక్ చేయాలి? :
మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయాలంటే ఈ కింది విధంగా ప్రయత్నించండి.
అధికారిక వెబ్సైట్ (https://pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
‘Farmers Corner’కి వెళ్లి లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి.
మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను ఎంటర్ చేయండి.
‘Get Report’ పై క్లిక్ చేసి, లబ్ధిదారుల జాబితాను చెక్ చేయండి.
మీ పేరు లేకపోతే ఏం చేయాలి? :
పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే కంగారుపడొద్దు. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం.. మీ జిల్లాలోని ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ కమిటీని సంప్రదించవచ్చు. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పీఎం కిసాన్ పోర్టల్లో అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయి.
కొత్త రైతు రిజిస్ట్రేషన్ (PM Kisan Yojana) :
మీరు ఫస్ట్ టైం అప్లయ్ చేసుకుంటుంటే లేదా చివరిసారి దరఖాస్తు చేసుకోకపోతే కొత్త రైతు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
ఆధార్, భూమి వివరాలను ఎంటర్ చేయండి.
ఫారమ్ రాష్ట్ర నోడల్ అధికారికి వెళ్తుంది.
వెరిఫికేషన్ తర్వాత విడతలో పేరు చేర్చవచ్చు.
ఆధార్ వివరాలను అప్డేట్ చేయండి :
మీ ఆధార్లో పేరు స్పెల్లింగ్ తేడాగా ఉంటే వాయిదా ఆగిపోవచ్చు. మీరు ఈ టూల్ సాయంతో పేరును ఎడిట్ చేయొచ్చు. ఈ ప్రక్రియ రియల్ టైమ్లో పూర్తి చేయొచ్చు.
మీరు e-KYC, రాంగ్ బ్యాంక్ వివరాలు, ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నంబర్ కారణంగా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. మీ జిల్లాలోని POC (పాయింట్ ఆఫ్ కాంటాక్ట్)ని సంప్రదించవచ్చు.
పీఎం కిసాన్ (https://pmkisan.gov.in)కి వెళ్లండి.
కిందికి స్క్రోల్ చేసి.. సెర్చ్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ (POC)పై క్లిక్ చేయండి.
జిల్లా నోడల్ ఆప్షన్ ఎంచుకోండి.
మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి.
సంబంధిత అధికారి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ కనిపిస్తాయి. మీరు సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడవచ్చు.