×
Ad

PM Kisan Yojana : కొత్త రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ కోసం అప్లయ్ చేశారా? 22వ విడత రూ. 2వేలు పడాలంటే ఇలా చేయండి..!

PM Kisan Yojana : పీఎం కిసాన్ కోసం కొత్తగా అప్లయ్ చేసుకున్న రైతులు కూడా 22 విడత డబ్బులను పొందవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఇలా రిజిస్టర్ చేసుకోవడమే.. అది ఎలాగంటే?

PM Kisan Yojana

  • కొత్త రైతులు కూడా 22వ విడతకు దరఖాస్తు చేసుకోవచ్చు
  • దరఖాస్తుకు ఆధార్, బ్యాంకు అకౌంట్, భూమి డాక్యమెంట్లు అవసరం
  • పీఎం కిసాన్ పోర్టల్‌లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్, మరెన్నో బెనిఫిట్స్

PM Kisan Yojana 22nd Installment : పీఎం కిసాన్ కొత్త రైతులకు బిగ్ అలర్ట్.. ఇప్పటివరకూ ఒక్క విడత కూడా అందుకోలేదా? కొత్తగా పీఎం కిసాన్ రూ. 2వేలు కోసం అప్లయ్ చేశారా? అయితే, మీరు రాబోయే 22వ విడత అందుకోవాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. మీరు అర్హులైతేనే పీఎం కిసాన్ విడత డబ్బులు అందుతాయి.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్దిపోందే రైతులకు ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తోంది. అయితే, ఈ పథకాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోని రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు, ఈ పథకం 21 వాయిదాలు విడుదలయ్యాయి. ప్రతి విడత లబ్ధిదారుని ఖాతాకు రూ. 2వేలు జమ అయ్యాయి. ఇప్పుడు, రైతులు 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

22వ విడత కోసం ఎదురు చూస్తున్నా రైతుల్లో చాలా మందికి ఇంకా ఒక్క విడత కూడా అందలేదు. 22వ విడత అందుతుందో లేదో అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ కొత్తగా అప్లయ్ చేసుకున్న రైతులకు పాత వాయిదా డబ్బులు రావు. కానీ, రాబోయే వాయిదా డబ్బులను అందుకునే అవకాశం ఉంది. అది ఎలాగా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ రైతులకు 22వ విడత అందుతుందా? :
మీరు కొత్త రైతు అయితే.. పీఎం కిసాన్ యోజనలో ఒక్క వాయిదా కూడా అందుకోకపోతే మీరు ఇప్పటికీ 22వ విడత పొందవచ్చు. మీరు అప్లయ్ చేసుకుంటే చాలు. ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి ప్రయోజనం పొందాలంటే మీరు రైతు అయి ఉండాలి. మీకు వ్యవసాయ భూమి ఉంటే.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తు ఆమోదం పొంది వెరిఫికేషన్ పూర్తి అయితే మీరు పీఎం కిసాన్ వాయిదాలను పొందవచ్చు.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : వారెవ్వా కిర్రాక్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5జీ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

పీఎం కిసాన్ యోజన 22వ విడత ఇంకా రాలేదు. మీరు ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటే.. మీకు 22వ విడత అందే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజనకు మీరు ఎలా అప్లయ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పీఎం కిసాన్ యోజన ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? :
అర్హత కలిగిన రైతులు రెవెన్యూ అధికారులు, గ్రామ పట్వారీలు లేదా ఇతర నియమిత ఏజెన్సీల సాయంతో అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. తద్వారా పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్‌లో సెల్ఫ్ రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు లేదా రిజిస్టర్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేయొచ్చు.

రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు :

  • పౌరసత్వ రుజువు
  • ఆధార్ కార్డు
  • బ్యాంకు ఖాతా వివరాలు
  • భూమి యాజమాన్య ఒరిజినల్ డాక్యుమెంట్లు

మీరు రిజిస్టర్ కోసం ఈ కింది విధంగా ఫాలో అవ్వండి :

  • పీఎం కిసాన్ పోర్టల్ విజిట్ చేయండి.
  • ‘Farmer Corner’ కింద ‘new farmer registration’ ఆప్షన్ ఎంచుకోండి.
  • ‘new farmer registration Forum’ పేజీ ఓపెన్ అవుతుంది.
  • రైతు ఇప్పటికే పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నారా లేదా అనే వెరిఫై చేయాలి.
  • ‘Rural farmer registration’ లేదా ‘Urban farmer registration’ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • మీ ఆధార్ నంబర్‌ ఎంటర్ చేసి, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
  • ఆపై వెరిఫికేషన్ కోసం క్యాప్చాను ఎంటర్ చేయండి.
  • ఇప్పుడు ‘Search’ బటన్‌ను ట్యాప్ చేయండి.
  • రైతు వివరాలు డేటాబేస్‌లో లేకుంటే ‘If you want to register yourself’ అనే పేజీ కన్ఫార్మ్ మెసేజ్ వస్తుంది. ‘Yes’ బటన్‌ను ఎంచుకోండి.
  • రిజిస్ట్రేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎంటర్ చేసి, ‘Save’పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు పేజీలో చూపిన సూచనలను ఫాలో అవ్వండి.