Union Budget 2026 : కేంద్ర బడ్జెట్పై గంపెడు ఆశలు.. రూ.5 లక్షల వరకు గృహ రుణ వడ్డీ రాయితీ? ఇళ్లు కొనేవారికి బిగ్ రిలీఫ్?
Union Budget 2026 : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గృహ రుణ వడ్డీ రాయితీని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతుందా? లేదా? గృహ కొనుగోలుదారులకు ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందా? లేదో చూడాలి..
- Sreehari A
- Published On : January 27, 2026 / 06:24 PM IST
Home Loan Interest Deduction ( Image Credit to Original Source)
- రియల్ ఎస్టేట్ రంగంలో బడ్జెట్పై భారీగా అంచనాలు
- గృహరుణాలపై రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వడ్డీ రాయితీ
- గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు అందించాలని డిమాండ్
- ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
Union Budget 2026 : కొత్త ఇల్లు కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదిమీకోసమే.. ప్రస్తుతం ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఇల్లు కొనాలంటే మధ్యతరగతి వారికి కష్టమే. అందుకే వచ్చే బడ్జెట్లో గృహరుణాలపై వడ్డీ రాయితీని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ఇళ్ళు కొనేందుకు గృహ రుణాలు తీసుకుంటారు.
అందులో మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇళ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అవసరమైన గృహ రుణ మొత్తం గతంలో కన్నా చాలా ఎక్కువగా మారింది. ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే, గృహ కొనుగోలుదారులకు భారీగా ఉపశమనం కలుగుతుందా? రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేలా వడ్డీ రాయితీని రాబోయే బడ్జెట్లో పెంచుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది..
గృహనిర్మాణ రంగాన్ని ప్రోత్సాహించాలి :
2026 కేంద్ర బడ్జెట్కు కొద్ది రోజులే ఉంది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా అంచనాలు పెరిగాయి. గృహ కొనుగోళ్లను సులభతరం చేసే ప్రభుత్వ నిర్ణయాల కోసం డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో సరైన నిర్ణయం తీసుకుంటే.. గృహనిర్మాణ రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు విశ్వసిస్తున్నాయి.
గృహ రుణ వడ్డీపై మినహాయింపు పెంచాలి :
గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు అందించాలంటూ డెవలపర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం, ఆదాయపు పన్ను చట్టం గృహ రుణ వడ్డీపై గరిష్టంగా రూ. 2 లక్షల తగ్గింపును అనుమతిస్తుంది. అయితే, గృహ ధరలు, వడ్డీ రేట్లు రెండూ పెరిగాయి.
ఈ పరిమితి చాలా తక్కువగా ఉందని డెవలపర్లు వాదిస్తున్నారు. అందువల్ల, గృహాలను కొనుగోలు చేసేందుకు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. అదేజరిగితే మధ్యతరగతికి ఉపశమనంతో పాటు రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
Read Also : Union Budget 2026 : బడ్జెట్కు ముందు హల్వా వేడుక.. ప్రతి ఏడాది ఈ సంప్రదాయం ఎందుకు జరుగుతుందో తెలుసా?
సరసమైన గృహాల పరిమితి ఏంటి? :
సరసమైన గృహాలంటే ఏంటి అనేదానిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం రూ. 4.5 మిలియన్ (సుమారు 1.5 మిలియన్ డాలర్లు) వరకు ధర పలికే ఇళ్లను మాత్రమే సరసమైన ఇళ్లుగా పరిగణిస్తోంది. డెవలపర్లు ఈ పరిమితిని చాలా ఏళ్ల క్రితం నిర్ణయించగా, అప్పటి నుంచి నిర్మాణ ఖర్చులు, భూమి ధరలు, ముడి పదార్థాలు గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు.
ప్రధాన నగరాలు, మహానగరాలలో, రూ. 4.5 మిలియన్ల (సుమారు 1.5 మిలియన్ డాలర్లు) విలువైన డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా దొరకడం కష్టంగా మారింది. అందుకే ఈ విభాగాన్ని నిజంగా ప్రోత్సహించేందుకు సరసమైన గృహాల ధర పరిమితిలో సవరణ అవసరమని అంటున్నారు.
స్టాండర్డ్ డిడక్షన్ పెరిగింది :
అద్దె ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం, రిపేర్లు, మెయింట్నెన్స్ కోసం అద్దె ఆదాయంపై 30శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. దీనిని 50శాతానికి పెంచాలని కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా అద్దె గృహాలలో పెట్టుబడులను ఆకర్షణీయంగా మారుస్తుందని, ఎక్కువ మంది అద్దె గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రోత్సహిస్తుందని హోం డెవలపర్లు అంటున్నారు.
