GOLD price
గత పదేళ్లలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక అస్థిరతలు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల్లో అభిప్రాయ మార్పులు వంటి అంశాలు ఈ పెరుగుదలకి కారణమయ్యాయి. 2011లో రూ.25,000గా ఉన్న పసిడి ధర ఇప్పుడు దాదాపు రూ.84,000కి చేరింది. బంగారం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తుందని పెట్టుబడిదారులు భావిస్తారు.
– బంగారం ధర 10 గ్రాములకు రూ.25,000 నుంచి రూ.50,000కి చేరేందుకు 9 సంవత్సరాలు పట్టింది
-రూ.50,000 నుంచి రూ.75,000కి పెరగడానికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పట్టింది
– ఇప్పుడు, బంగారం రూ.84,300 (10 గ్రాములకు) దాటి వేగంగా పెరుగుతోంది. దీన్నిబట్టి ధరలు పెరుగుతున్న తీరును అర్థం చేసుకోవచ్చు
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
2025లో బంగారం ధర రూ.లక్షకు చేరుతుందా?
ప్రస్తుతం బంగారం ధర రూ.84,300గా ఉంది. రూ.1,00,000 చేరాలంటే 13.5% పెరుగుదల అవసరం. ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్ను బట్టి ఇది సాధ్యమే.
బంగారం ధరను మరింత పెంచే అంశాలు
నిపుణుల అభిప్రాయాలు
కోలిన్ షా (Kama Jewelry) – ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారం ధర ఎన్నడూలేనంత పెరుగుతుందని అన్నారు
డా. రేణిషా (Augmont) – భూభౌగోళిక పరిణామాలు బాగోలేకపోతే బంగారం ధర రూ.1,00,000 చేరుతుందని అన్నారు
జమాల్ మెక్లై (Mecklai Financial) – బంగారం ధర ఔన్సుకు $3,000 వద్ద కొంత కాలం ఆగవచ్చని, కానీ ఇంకా పెరుగుదల సాధ్యమేనని అన్నారు
అపూర్వ శేఠ్ (Samco Securities) – అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో బంగారం రూ.1,48,071 చేరగలదని అంచనా వేశారు