Chhattisgarh: చత్తీస్గఢ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తర్వాత, బలోదా బజార్ జిల్లా, భాటపార రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒక పికప్ వ్యాన్లో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో పికప్ వ్యాన్లో ప్రయాణిస్తున్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది తీవ్ర గాయలపాలయ్యారు. ఘటన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స కొనసాగుతోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.