Hyderabad : హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి కోకాపేటలో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. విజయవాడకు చెందిన విజయ్ కుమార్ , పద్మారాణి దంపతులు వారి కుమారుడు శ్యామ్(14) తో కలిసి… హైదరాబాద్, కోకాపేట, సన్ షైన్ ఈకో పోలీస్ అపార్ట్ మెంట్లో ఉంటున్న వారి బంధువులు సాయివరుణ్ ఇంటికి వచ్చారు.
శనివారం సాయంత్రం సాయి వరుణ్ పిల్లలతో కలిసి, శ్యామ్ అపార్ట్ మెంట్ లోని ఈత కొలనులో దిగాడు. శ్యామ్ కు ఈత రాకపోవటంతో నీటిలో దిగి మునిగి పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం గచ్చిబౌలీ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం శ్యామ్ కన్నుమూశాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Karnataka : పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింత సాంప్రదాయం … ఎక్కడో తెలుసా..