మరో దారుణం : ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి…దారుణంగా చంపేశారు

రాజస్థాన్ లో దారుణం జరిగింది. టాంక్ జిల్లాలో శనివారం(నవంబర్-30,2019)అదృశ్యమైన ఆరేళ్ల విద్యార్థిని… రేప్ చేయబడి,తన స్కూల్ బెల్టునే మెడకు బిగించి అత్యంత దారుణం చంపివేయబడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

చిన్నారి గ్రామం కేథడికి దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతంలోని పొదల్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు. స్పాట్ లో లిక్కర్ బాటిల్స్,స్నాక్స్,రక్తపుమరకలను గుర్తించినట్లు తెలిపారు. చిన్నారి చదువుతున్న స్కూల్ లో శనివారం ఆటల పోటీలు జరిగాయి. అందులో పాల్గొన్న చిన్నారి అదృశ్యమైందని, చిన్నారి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారని,ఇవాళ ఉదయం చిన్నారి గ్రామానికి దగ్గర్లో తన మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఆరేళ్ల చిన్నారిపై ఈ దారుణాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున స్థానికులు స్పాట్ కు చేరుకున్నారు. నిందులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది రేప్,మర్డర్ కేసు అని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ ఆదర్శ్ సిద్దూ తెలిపారు.