Acid attack on cows : దారుణం : ఆవులపై యాసిడ్ దాడి

Acid attack on cows at Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. 12 ఆవులపై దుండగులు యాసిడ్‌ పోశారు. నారాయణపురం, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు ఆవులపై యాసిడ్‌తో దాడి చేశారు. ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి.

దాడికి గురైన ఆవులకు పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆవుల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆవులు ప్రతిరోజు బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివస్తాయని… అవి బయట తిరుగుతున్నప్పడు దుండగులు ఈదుశ్చర్యకు పాల్పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు