Karnataka accident:కర్ణాటకలో కారు-లారీ ఢీ..నలుగురి దుర్మరణం

Karnataka accident: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్యా జిల్లా నాగామంగళ తాలూకాలోని తిరుమలపురా గ్రామం వద్ద ఇసుక లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. వేగంగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి.(Car-lorry collision) ఈ ప్రమాదంలో తుమకూరు, రామనగర, శివమొగ్గ ప్రాంతాల వాసులు మరణించారు.

Odisha Train Accident : ఒడిషా రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్ధరణ..ట్రాక్‌పై వెళ్లిన మొదటి రైలు

పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. రోడ్డుపై ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు తొలగించారు.అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు