Family members of girl kill 19 year old youth : కూతుర్ని ప్రేమించాడని ఇంటికి పిలిచి హత్య చేసిన కుటుంబ సభ్యులు

ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించాడనే కారణంతో 19 ఏళ్ల యువకుడిని కుటుంబ సభ్యులు కొట్టి చంపి శవాన్ని చెరువు లో పడేశారు.

Family members of girl kill 19 year old youth in Uttar Pradesh, due to love affair : ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించాడనే కారణంతో 19 ఏళ్ల యువకుడిని కుటుంబ సభ్యులు కొట్టి చంపి శవాన్ని చెరువు లో పడేశారు.

జిల్లాలోని మావానా పోలీసు స్టేషన్ పరిధిలోని అటోరా గ్రామంలో నివసించే బీఏ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని, అదే గ్రామానికి చెందిన అభిషేక్ గుర్జార్ (19) అనే యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం ఇటీవల బాలిక ఇంట్లోని తల్లి తండ్రులకు తెలిసింది. బాలిక తల్లితండ్రులు యువకుడిని పిలిచి మందలించారు. ప్రేమ పేరుతో తమ అమ్మాయి వెంట పడొద్దని హెచ్చరించారు. గ్రామ పెద్దల ముందు పంచాయతీ కూడా జరిగింది. ఇక అబ్బాయి అమ్మాయితో మట్లాడకూడదని పంచాయతీ ఆదేశించింది.

మా అమ్మాయితో ప్రేమ గీమ అంటూ వస్తే చంపేస్తామని..కొడుకును అదుపులో పెట్టుకోమని బాలిక తల్లి, తండ్రులు బంధువులు.. అభిషేక్ తండ్రిని హెచ్చరించారు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ కలుసుకోవటం తగ్గించారు. కానీ వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నారు.

ఈ సంగతి బాలిక తల్లి తండ్రులు పసిగట్టారు. ఆమె ఫోన్ ను పరిశీలించి చూడాగా వాళ్లిద్దరూ గతకొన్నాళ్లుగా మాట్లాడుకుంటున్నట్లు తెలుసుకున్నారు. కోపంతో రగిలిపోయారు. వద్దని చెప్పినా తమపిల్లతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న అభిషేక్ కు ఎట్టాగైనా బుధ్ది చెప్పాలనుకున్నారు. ఇంట్లో ఎవరూ లేరు. కలుద్దాం ఇంటిక రమ్మనిమని తమ కుమార్తెతో ఫోన్ చేసి పిలిపించారు.

నిజమని నమ్మి… ప్రేయసి రమ్మంది కదా అనే ఉత్సాహంతో అభిషేక్ శుక్రవారం రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో మాటువేసి ఉన్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అభిషేక్ లోపలకు రాగానే ఇంటి తలుపులు మూసివేశారు. ఆయువకుడిని దారుణంగా కొట్టి చితక బాదారు. వారు కొట్టిన దెబ్బలకు అభిషేక్ అక్కడే కన్నుమూశాడు.

మృతదేహాన్ని గోనె సంచిలో ప్యాక్ చేసి సమీపంలోని చెరువులో పడేశారు. శనివారం ఉదయం చెరువులోని శవాన్ని చూసిన స్దానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శవాన్ని బయటకు తీసి మృతుడ్ని గుర్తించారు. అభిషేక్ తల్లితండ్రులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. కేసులో ముద్దాయిలుగా ఉన్న బాలిక తండ్రి అనుజ్,తాత మహిపాల్, మేనమామ ఓంకార్, కజిన్ సోదరులను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు