ఆసిఫాబాద్లో సంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జీషీట్ను కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి దాఖలు చేశారు. 44 మంది సాక్షులతో 150 పేజీల ఛార్జీషీట్ ఉంది. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఐదుగురిని విచారిస్తారని తెలుస్తోంది.
నిందితులు ఏ 1 షేక్ బాబు, ఏ 2 షేక్ షాబద్దీన్, ఏ 3 షేక్ మఖ్దూం. వీరిపై 302, 376 డి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సమతను గొంతుకోసం చంపేసినట్లు ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించింది. డీఎన్ఏ టెస్టుతో నిందితులను నిర్ధారించారు పోలీసులు.
* ఆసిఫాబాద్లోని లింగాపూర్ అత్యాచార బాధితురాలి పేరును మార్చారు. సమత అని పిలవాలని ఎస్పీ మల్లారెడ్డి ఆదేశించారు.
* 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు హత్యాచారం జరపడం..
* సీన్ రీ కన్ స్ట్రక్షన్లో భాగంగా షాద్ నగర్కు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున నిందితులను తీసుకెళ్లడం..పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పులు నలుగురు నిందితులు చనిపోయారు.
* దీంతో ఒక్కసారిగా ఇతర హత్యాచార కేసుల్లోనూ నిందితులను కాల్చి చంపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
* ఒంటరిగా ఉన్న చిరు వ్యాపారం చేసుకొనే వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి..చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు.
* అఘాయిత్యం చేసిన తర్వాత..మహిళను హత్య చేసి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు.
* ఈ ఘటన 2019, నవంబర్ 24వ తేదీగా జరిగినట్లు భావిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* ఖానాపూర్ మండలం గోసంపల్లికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.
* ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబద్దీన్, షేక్ మఖ్దూంలుగా గుర్తించారు.
* దళిత మహిళపై హత్యాచారానికి పాల్పడిన వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్ ఉధృతమైంది.
* ఎల్లపటార్, జైనూర్, సిర్పూర్, లింగాపూర్ గ్రామ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆందోళనలు.నిరసనలకు దిగారు.
* నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీనిస్తున్నారు.
Read More : విద్యార్థితో గుంజిళ్లు తీయించిన పీఈటీ..నోటి వెంట రక్తం..