Woman Jumps Into Well : తీవ్ర విషాదం… ఐదుగురు కూతుళ్లతో బావిలో దూకిన తల్లి

రాజస్తాన్ కోటాలోని రామగంజ్ మండిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Woman Jumps Into Well : రాజస్తాన్ కోటాలోని రామగంజ్ మండిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని బాదందేవి(40) గా గుర్తించారు. ఆమెతో పాటు కూతుళ్లు సావిత్రి(14), అంకాలి(8), కాజల్(6), గుంజన్(4), అర్చన(1) ప్రాణాలు కోల్పోయారు. కాగా, మిగతా ఇద్దరు కూతుళ్లు (గాయత్రి-15, పూనమ్-7) నిద్రపోవడం వల్ల తల్లి వారిని బావి దగ్గరికి తీసుకెళ్ల లేదు. దీంతో వారి ప్రాణాలు దక్కాయి.

దంపతుల మధ్య గొడవలే దీనికి కారణం అని పోలీసులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆరు మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

బాదందేవి, ఆమె భర్త శివ్ లాల్ బంజారా మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త తీరుతో విసిగిపోయిన బాదందేవి తీవ్ర నిర్ణయం తీసుకుంది. మైనర్ కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో శివ్ లాల్ ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు. శివ్ లాల్ తన పక్క గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు.

iPhone 12 Pro : అమెజాన్‌ బిగ్ డీల్.. ఐఫోన్ 12ప్రోపై రూ.25వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్!

బాదందేవి ఇంటికి 100 మీటర్ల దూరంలో బావి ఉంది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న శివ్ లాల్ ఆదివారం ఉదయం ఇంటికి వచ్చాడు. పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. దంపతుల మధ్య గొడవలు సహజం. కానీ, ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు స్థానికులు. దంపతుల మధ్య గొడవలతో ఎలాంటి సంబంధం లేని పిల్లలు ఏం పాపం చేశారని, ఆ తల్లి వారికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేసిందని స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు