Student Suicide IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీ ఈ బ్లాక్లోని 107 నెంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
రాహుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.