ఆఫనిస్తాన్ జర్నలిస్ట్ మినా మంగాల్ ను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపారు.రాజధాని కాబూల్ లోని కార్టే న్యూ మార్కెట్ దగ్గర శనివారం(మే-11,2019) ఉదయం బైక్ పై వచ్చిన ఓ దుండగుడు ఆమెపై కాల్పులు జరిపి పారిపోయినట్లు ఇంటిరీయర్ మినిస్ట్రీ ప్రతినిధి నస్రత్ రైమి తెలిపారు.ఆఫ్గనిస్తాన్ పార్లమెంట్ కు కల్చరల్ అడ్వైజర్ గా కూడా మంగాల్ పనిచేస్తోంది.
అరినా టీవీలో ప్రజెంటర్ గా 10 ఏళ్ల నుంచి మంగాల్ పనిచేస్తోంది.గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఇటీవల మంగాల్ పోస్ట్ కూడా పెట్టింది.2017లో మంగాల్ కి వివాహం అవగా ఈ నెల ప్రారంభంలో ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది.