Rachakonda : సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీసుస్టేషన్ సీఐ నాగేశ్వరరావు మహిళపై అత్యాచారం చేసిన కేసు మరువక ముందే, మరో ఎస్సై తనని రేప్ చేశాడని తెలంగాణలో మరో మహిళ ఒక ఎస్సైపై ఫిర్యాదు చేసింది.
మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ గా పని చేస్తున్న ధరావత్ విజయ్పై నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రేప్ కేసు నమోదైంది. తనతో కొంతకాలం సహజీవనం చేసి, ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంతకు ముందే పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి తనతో సహజీవనం చేశాడని..కొంతకాలం పాటు ఇద్దరం హైదరాబాద్లో కలిసే ఉన్నామని బాధితురాలు తెలిపింది.
ఇప్పుడు తనను వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై విజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాగా … యువతి ఫిర్యాదుతో ఎస్ఐ విజయ్ ను రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. కేసుపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు. గతంలో వనస్ధలిపురం పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా విజయ్ సస్పెన్షన్కు గురయ్యాడు.
Also Read : Hyderabad : పరారీలో సీఐ నాగేశ్వరరావు-గాలిస్తున్న పోలీసులు