అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకున్న కారు, లారీ

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలం వంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో

Road Accident

Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలం వంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, లారీ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందింది.

Also Read : వామ్మో.. చోరీలు, దోపిడీలు నేర్పించే స్కూల్.. అడ్మిషన్ ఫీజు రూ.3 లక్షలు..

ప్రమాద సమయంలో కారు కడప నుంచి తాడిపత్రికి వస్తుంది. వంగునూరు సమీపంలోకి రాగానే ప్రమాదం జరిగింది. మృతులు తాడిపత్రికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలిని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు