Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
చిత్తూరు జిల్లా సదుం మండలం ఎగువ జాండ్రపేటలో ఒకయువతి,యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మదనపల్లి ప్రాంతానికి చెందిన రాధారాణి, వెంకటరమణ, రాములు కొంతకాలంగా ఎగువ జాండ్రపేటలోని వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నారు.
- chvmurthy
- Published On : May 21, 2022 / 12:52 PM IST
Chittoor Murder Case
Chittoor : చిత్తూరు జిల్లా సదుం మండలం ఎగువ జాండ్రపేటలో ఒకయువతి,యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మదనపల్లి ప్రాంతానికి చెందిన రాధారాణి, వెంకటరమణ, రాములు కొంతకాలంగా ఎగువ జాండ్రపేటలోని వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నారు. ఈరోజు రాధారాణి, వెంకటరమణల ను విగతజీవులుగా స్ధానికులు గుర్తించారు. నిన్నరాత్రి గుర్తు తెలియని దుండగులు వారిద్దరినీ బండరాదితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది . కాగా వీరితో పాటు ఉండే రాము అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. రాము ఈ ఘతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రాధారాణికి అనంతపురం జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడితో గతంలో వివాహం జరిగింది. నాలుగు నెలల క్రితం వీరిద్దరూ విడిపోయారు. అనంతరం సోదరుడు వెంకటరమణ, మిత్రుడు రాముతో కలిసి ఎగువ జాండ్రపేటకు వచ్చి నివాసం ఉంటూ వాటర్ ప్లాంట్ లో పని చేసుకుని బతుకుతున్నారు.
రాధారాణి, ఆమె సోదరుడు వెంకటరమణను గత రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Palnadu : దూరంగా ఉన్న పిల్లలు…మానసిక ఒత్తిడితో తల్లి ఆత్మహత్య
