Vijayawada : విజయవాడలో దారుణ హత్యకు గురైన ఫుట్బాల్ ప్లేయర్ ఆకాష్ మర్డర్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోలీసు కమీషనర్ కాంతిరాణా ఠాఠా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
ఆకాష్ను హత్య చేసిన తర్వాత నిందితులు చెన్నై వెళ్లినట్లు తెలుసుకుని ప్రత్యేక బృందాలను చెన్నై పంపించారు. అక్కడ నిందితులు ప్రభా తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభా గ్యాంగ్ కు సంబంధించిన సభ్యులను విజయవాడలో పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
ఆకాష్ను ఎందుకు హత్యచేయవలసి వచ్చింది. దానికి గల కారణాలు ఏమిటీ అనే కోణంలో ప్రభా ను పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు మరో రెండు రోజుల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.