ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ : మహిళా మావోయిస్టు మృతి
- veegam team
- Published On : March 19, 2019 / 02:40 PM IST
ఛత్తీస్ గడ్ : రాజనందగావ్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు మృతి చెందారు. మార్చి 19 మంగళవారం రాజనందగావ్ దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
