కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తట్టుకోలేకపోయిన
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో తట్టుకోలేకపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నా అని టిక్ టాక్ వీడియోలో చెప్పి మరీ సూసైడ్ చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో మంగళవారం(జూన్ 23,2020) ఈ ఘటన చోటు చేసుకొంది.
ఆర్థిక ఇబ్బందులతో తండ్రి ఆత్మహత్య:
కామారెడ్డి మండలం తిమ్మక్పల్లికి చెందిన గుర్రాల సాయవ్వ-నారాయణ దంపతులు ఉపాధి నిమిత్తం కామారెడ్డికి వచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో నారాయణ కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లి సాయవ్వ బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషిస్తోంది. సాయవ్వకు ముగ్గురు కొడుకులు. చిన్నవాడు సంతోష్(22). ఇద్దరు కొడుకులు హైదరాబాద్లో పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. సంతోష్ డ్రైవింగ్ చేసేవాడు.
ప్రేమగా మారిన పరిచయం:
ఓ యువతితో సంతోష్ పరిచయం పెంచుకున్నాడు. అది ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సంతోష్ను మందలించారు. అంతేకాక యువతిని వరంగల్కు తీసుకెళ్లిపోయారు. అప్పటినుంచి సదరు యువకుడు మానసికంగా కుంగిపోయాడు. తనకు దూరమైన ప్రేయసికి ఫోన్ చేసేవాడు.
యువతిని వరంగల్ తీసుకెళ్లిపోయిన తల్లిదండ్రులు:
ఓ రోజు ‘నీ ఎడబాటును భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ టిక్టాక్ వీడియోలో చెప్పాడు. ఆ విషయాన్ని ప్రేయసికి ఫోన్ చేసి చెప్పాడు. ఆమె ఫోన్ చేసిన 10 నిమిషాల వ్యవధిలోనే ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు సంతోష్. కొడుకు మృతితో తల్లి షాక్ కి గురైంది. తనకు అండగా ఉంటాడని భావించిన కొడుకు ఇక లేడని తెలిసి గుండె పగిలేలా రోదించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Read: తమిళనాడులో లాకప్ డెత్ : పోలీసు దెబ్బలకు తండ్రి, కొడుకు మృతి