వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెదిరింపుల కేసులో నోటీసులు ఇచ్చేందుకు పీవీపీ నివాసానికి వెళ్లిన పోలీసులపై ఆయన అనుచరుడు ఖలీద్ కుక్కలను ఉసిగొల్పాడు. భయంతో బంజారా హిల్స్ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పీవీపీకి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో ఖలీద్ కుక్కలను వారిపైకి వదిలినట్టు ఆరోపిస్తున్నారు పోలీసులు. పీవీపీ అనుచరుడు ఖలీద్ నిర్వాహకంపై ఎస్ ఐ హరీశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో నిందితుడు ఖలీద్పై 353 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కలను వదిలినందుకు కొత్త సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.
Read:రఘురాంపై ఎంపీ బాలశౌరిని అస్త్రంగా సంధించిన వైసీపీ