AP DSC Exam Revised Schedule : ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ డీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష 2024ని వాయిదా వేసింది. ఏపీలో 6,100 ఉపాధ్యాయ నియామాకాలకు ప్రకటించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్లో మార్పులు చేసింది. తొలుత ప్రకటించిన డీఎస్సీ షెడ్యూల్ ప్రకారం.. మార్చి 15 నుంచి మార్చి 30, 2024 మధ్య పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఇప్పుడు వాయిదా పడింది. హైకోర్టు జోక్యంతో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు జరిగాయి.
Read Also : Amit Shah : ఆ మూడు.. కుటుంబ పార్టీలు అంటూ నిప్పులు చెరిగిన అమిత్ షా
సవరించిన కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏపీ డీఎస్సీ పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య మొత్తం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. TGT, PGT, ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఏప్రిల్ 7, 2024న నిర్వహించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు విడతలుగా (SGT) పోస్టులకు పరీక్ష జరుగనుంది.
స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపాల్ పోస్టులకు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఏపీ డీఎస్సీ పరీక్ష సాధారణంగా రెండు షిఫ్ట్లలో జరుగనుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు జరుగనుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రొవిజనల్ ఆన్సర్ కీ మేలో విడుదల కానుంది. అభ్యర్ధులకు అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించనున్నారు.
టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు సిద్ధం అయ్యేందుకు మరింత సమయం కోరుతూ దాఖలైన పిటిషన్కు ప్రతిస్పందనగా హైకోర్టు.. ఏపీ టెట్, ఏపీ డీఎస్సీ 2024 పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల సమయాన్ని తప్పనిసరి చేసింది. దాంతో ఏపీ డీఎస్సీని వాయిదా పడిందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులకుగానూ ఎస్జీటీకి 2,280, స్కూల్ అసిస్టెంట్కి 2,299, టీజీటీకి 1264, పీజీటీకి 215 సహా 6,100 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సవరించిన పరీక్షల షెడ్యూల్ గురించి మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ విజిట్ చేయొచ్చు.
ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్ 2024 వివరాలివే :