Arvind Kejriwal : దళిత విద్యార్థుల ఉన్నత విద్య కోసం డాక్టర్ అంబేద్కర్ స్కాలర్షిప్.. కేజ్రీవాల్ ప్రకటన!
Arvind Kejriwal : వచ్చే ఎన్నికల్లో ఆప్ గెలిస్తే దళిత వర్గాలకు చెందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత పాఠశాల విద్యను కొనసాగిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.
- Sreehari A
- Published On : December 21, 2024 / 03:33 PM IST
Arvind Kejriwal Announces Dr Ambedakar Scholarship
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే దళిత విద్యార్థులకు డాక్టర్ బిమ్రావ్ అంబేద్కర్ పేరిట స్కాలర్షిప్ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.
ఢిల్లీలో ఏఏపీ తిరిగి అధికారంలోకి వస్తే.. డాక్టర్ అంబేద్కర్ స్కాలర్షిప్ కింద భారత్ లేదా విదేశాలలో విద్యార్థులకు ప్రవేశం పొందిన తర్వాత రవాణా, బస వంటి ఖర్చులను కవర్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం దళిత విద్యార్థుల ఉన్నత విద్యకు నిధులను అందిస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఆప్ గెలిస్తే దళిత వర్గాలకు చెందిన విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత పాఠశాల విద్యను కొనసాగిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. సమాజానికి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావడానికి పార్టీ అధినేత ఫ్రీ కోచింగ్ను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.
దళిత విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ స్కాలర్షిప్ను ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత, హోం మంత్రి అమిత్ షాను నిందించారు. అంబేద్కర్ను ఎగతాళి చేశారని ఆరోపించారు. అమిత్ షా మాట్లాడిన పదాలు అవమానకరమైనవి, ఆయన మాట్లాడిన విధానం అంబేద్కర్ను ఎగతాళి చేసేలా ఉంది” అని కేజ్రీవాల్ విమర్శించారు.
“స్వతంత్ర భారత్లో దేశ పార్లమెంటులో అంబేద్కర్ను అవమానించే రోజు వస్తుందని ఎవరూ ఊహించలేరు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అపహాస్యం పాలవుతాడు” అని కేజ్రీవాల్ అన్నారు.
Read Also : Video: హుండీలో పడిపోయిన ఐఫోన్.. దేవుడికే చెందుతుందని తిరిగి ఇవ్వని ఆలయ నిర్వాహకులు..
