MIDHANI Recruitment : హైదరాబాద్ కంచన్బాగ్లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్(మిధాని) వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : DGP Rajendranath Reddy: చంద్రబాబు లేఖపై దర్యాప్తు జరుగుతోంది.. టీడీపీ నేతల నిరసనలను ఎక్కడా అడ్డుకోలేదు
ఖాళీల వివరాలకు సంబంధించి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఫిట్టర్): 13 పోస్టులు, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (వెల్డర్): 02 పోస్టులు, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్): 06 పోస్టులు, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెటలర్జీ): 20 పోస్టులు, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెకానికల్): 10 పోస్టులు, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారాలు !
పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి జేవోటీ పోస్టులకు 30 సంవత్సరాలు. ఎస్ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైన వారికి నెలకు జేవోటీ పోస్టులకు రూ.20,000. ఎస్ఓటీ పోస్టులకు రూ.21,900 చెల్లిస్తారు.
READ ALSO : ఈ వ్యాధి వస్తే.. దగ్గినా ఎముకలు విరిగిపోతాయి!
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.11.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://midhani-india.in/ పరిశీలించగలరు.