MIDHANI Recruitment :హైదరాబాద్ మిధానిలో పలు పోస్టుల భర్తీ

పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి జేవోటీ పోస్టులకు 30 సంవత్సరాలు. ఎస్‌ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

MIDHANI Recruitment : హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగం లిమిటెడ్‌(మిధాని) వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : DGP Rajendranath Reddy: చంద్రబాబు లేఖపై దర్యాప్తు జరుగుతోంది.. టీడీపీ నేతల నిరసనలను ఎక్కడా అడ్డుకోలేదు

ఖాళీల వివరాలకు సంబంధించి జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఫిట్టర్): 13 పోస్టులు, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (వెల్డర్): 02 పోస్టులు, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్): 06 పోస్టులు, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెటలర్జీ): 20 పోస్టులు, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (మెకానికల్): 10 పోస్టులు, సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 03 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారాలు !

పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి జేవోటీ పోస్టులకు 30 సంవత్సరాలు. ఎస్‌ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష, ట్రేడ్ టెస్టుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైన వారికి నెలకు జేవోటీ పోస్టులకు రూ.20,000. ఎస్‌ఓటీ పోస్టులకు రూ.21,900 చెల్లిస్తారు.

READ ALSO : ఈ వ్యాధి వస్తే.. దగ్గినా ఎముకలు విరిగిపోతాయి!

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.11.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://midhani-india.in/ పరిశీలించగలరు.

 

ట్రెండింగ్ వార్తలు