Walking After Eating: తిన్నవెంటనే కూర్చుంటున్నారా.. ఈ చిన్న సమస్య ప్రాణాంతకం కావచ్చు జాగ్రత్త.

Walking After Eating: తిన్న వెంటనే కూర్చోవడం వల్ల శరీరం దిశ మార్చుకుంటుంది. దీనివల్ల కడుపులో ఆహారం అరగడం ఇబ్బంది అవుతుంది.

Laying after eating

మనలో చాలా మందికి భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం అలవాటుగా ఉంటుంది. కొంతమంది అటు ఇటు రెండు అడుగులు వేసినా వెంటనే కూర్చుండిపోతారు. ఈ అలవాటు కొన్నిసార్లు ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉందట. నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి తిన్న వెంటనే కూర్చోవడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.

జీర్ణక్రియ సవ్యంగా జరగదు: తిన్న వెంటనే కూర్చోవడం వల్ల శరీరం దిశ మార్చుకుంటుంది. దీనివల్ల కడుపులో ఆహారం అరగడం ఇబ్బంది అవుతుంది. ఫలితంగా కడుపునొప్పి, కడుపులో వాపు, అసిడిటీ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.

అసిడిటీ సమస్య: భోజనం తర్వాత వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వలన జీర్ణరసాలు పైకి వస్తాయి. దీనిని గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారు. దీనివల్ల గొంతులో మంట, ఛాతీలో మంట, నోటికి చేదు రుచి రావడం వంటి లక్షణాలు ఏర్పడతాయి.

అలసట, నిద్రలేమి: తిన్న వెంటనే కూర్చోవడం వలన శరీర భంగిమలో ఎలాంటి మార్పు ఉండదు కానీ, జీర్ణక్రియలో ఎటువంటి సహకారం లభించదు. ఫలితంగా మానసిక అలసట ఏర్పడుతుంది. కొంతమందిలో ఇది నిద్రలేమికి దారి తీస్తుంది.

బరువు పెరగడం: తిన్న వెంటనే కూర్చోవడం వలన క్యాలరీస్ వాడకం జరగదు. దాంతో అవి ఫ్యాట్ గా మారతాయి. దీనివల్ల స్థూలకాలం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. క్రమంగా అది గుండె పనితీరుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.

మలబద్ధక సమస్యలు: తిన్న తరువాత పడుకోవడం చేయడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. ఫలితంగా పేగు సమస్యలు, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.

ఇతర సమస్యలు:

  • తిన్న వెంటనే కూర్చోవడం వల్ల కాస్త శ్వాసతీయడంలో సమస్య ఏర్పడే అవకాశం. కాబట్టి ఊపిరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది.
  • ఈ అలవాటు ఉన్న వ్యక్తులలో ఉత్సాహం, చలాకి తనం తగ్గుతుంది.
  • ఈ అలవాటు డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదం. క్యాలరీస్ పెరిగిపోయి షుగర్ కంట్రోల్ లో ఉండదు.

అసలు తిన్న తర్వాత ఏం చేయాలంటే?

  • తిన్న వెంటనే 5–10 నిమిషాలు నెమ్మదిగా నడవాలి.
  • కనీసం 30 నిమిషాలు నిలబడి ఉండటం మంచిది.
  • తిన్న తర్వాత కాఫీ/టీ తాగవద్దు. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది.
  • తిన్న తరువాత వెంటనే ఎలాంటి పని చేయకండి. శరీరానికి కాస్త రెస్ట్ అవసరం.