గణేష్ నిమజ్జన ఖర్చు భారీగానే ఉంది. క్రేన్ల అద్దె, కార్మికుల వేతనాలు తదితరాల కోసం జీహెచ్ ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం నగరంలోని 32 చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుండగా, ఇక చిన్నకొలనులకు లెక్కనే లేదు. హుస్సేన్ సాగర్ సహా జోన్ల పరిధిలోని 32 చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను జీహెచ్ ఎంసీ ఈవీడీఎం విభాగం సమకూరుస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన నిమజ్జనాలు సెప్టెంబర్ 15 వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆయా చెరువుల్లో నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా క్రేన్లు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. నిమజ్జనం జరిగే గంటలను పరిగణనలోకి తీసుకొని అవసరమయ్యే కార్మికులను బ్యాచ్ ల వారీగా వినియోగించనున్నట్లు, వేతనాలనూ గంటల వారీగా చెల్లించనున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటి తెలిపారు.
క్రేన్ల దగ్గర అవసరాన్ని బట్టి నలుగురు, ఎనిమిది మంది, 12 మంది కార్మికులతో కూడిన బ్యాచ్ లను ఏర్పాటు చేశారు. ప్రాథమిక అంచనా వేురకు క్రేన్ల అద్దె, సిబ్బంది వేతనాలకు రూ. 8 కోట్ల 24 లక్షలు ఖర్చు కానుండగా ఆయా ప్రాంతాల్లోని నిమజ్జనాల పరిస్థితులు , పోలీసుల నుంచి అందుతున్న సమాచారం తదితర పరిగణనలోకి తీసుకుంటే ఖర్చు రూ.9 కోట్లకు చేరే అవకాశముందని తెలిపారు.
క్రేన్లు..
కార్మికులు…
ఖర్చు..
కార్మికుల వేతనాలు..