తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ 22 ఆదివారం బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
శాసనమండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగాయి. ఈ ఐదు రోజుల కాల వ్యవధిలో 17 గంటల 37 నిమిషాల పాటు చర్చలు సాగాయి. ఈ సమావేశాల్లో శాసనమండలి 3 బిల్లులను ఆమోదించింది.