మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అడ్డుకున్న విద్యార్ధి సంఘాలు

  • Publish Date - May 4, 2019 / 02:39 PM IST

హైదరాబాద్: నిజాం కాలేజి వార్షికోత్సవానికి వచ్చిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను విద్యార్ధి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ NSUI కి చెందిన కార్యకర్తలు ధర్నా చేశారు. ఇంటర్ బోర్డు తీరువల్ల నష్ట పోయిన విద్యార్ధులకు వారి కుటుంబాలకు న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యార్ధి సంఘాల నాయకులు హెచ్చరించారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న విద్యార్ధి సంఘాలనాయకులను పోలీసులు అరెస్టు చేశారు.