అసలు జరిగింది ఇదే: రాజశేఖర్ యాక్సిడెంట్‌పై జీవిత క్లారిటీ

  • Publish Date - November 13, 2019 / 09:26 AM IST

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు(TS 07 FZ 1234) ప్రమాదానికి గురవగా ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరగగా టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని కారు ప‌ల్టీలు కొట్టిన‌ట్టు తెలుస్తుండగా.. ఇదే విషయమై క్లారిటీ ఇచ్చేందుకు రాజశేఖర్ భార్య సినీ నటి జీవిత మీడియా ముందుకు వచ్చారు.

రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయిందనే వార్త చూసి ఆయనకు ఏమైందో అని అనేకమంది ఫోన్లు చేస్తున్నారని, అసలు ఏం జరిగిందో అందరికీ చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు జీవిత చెప్పారు. మీడియాలో ప్రమాదానికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయని, అందులో అనేక వార్తల్లో వాస్తవం లేదని  ఆమె వివరించారు.

రాత్రి 1.30 గంటల ప్రాంతంలో రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రాజశేఖర్ గారు ఇంటికి వస్తున్నారని, అదే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు టైర్ పగలడంతో కంట్రోల్ తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిందని చెప్పారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఓ కారు ఆగి, అందులో ఉన్నవాళ్లు దిగి చూసి రాజశేఖర్ గారిని గుర్తుపట్టి సాయం చేశారని వెల్లడించారు. వాళ్ల ఫోన్ నుంచే పోలీసులకు, మాకు ఫోన్ చేసి జరిగింది చెప్పారని వివరించారు.

వాళ్ల కారులోనే సగం దూరం రాగా.. మేము ఎదురు వెళ్లి పికప్ చేసుకున్నామని వివరించారు. ఆ తర్వాత నేను పోలీసులకు ఫోన్ చేసి వివరాలు చెప్పానని, రాజశేఖర్ గారి వస్తువులను వెరిఫై చేశాక, రాజశేఖర్ గారి క్షమూం గురించి ఆయనతో కూడా మాట్లాడారని చెప్పారు. తర్వాత డాక్టర్ కూడా ఇంటికి వచ్చి ఆయనను చూశారని చెప్పారు. ఒక చిన్న గాయం తప్ప ఎలాంటి బలమైన గాయాలు కాలేదని వెల్లడించారు.

రాజ‌శేఖ‌ర్‌కు కారు ప్రమాదం జరగడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. రెండేళ్ల క్రితం రాజేంద్ర న‌గ‌ర్‌లో రాజ‌శేఖ‌ర్ కారు మ‌రో కారుని ఢీ కొట్టింది. రామిరెడ్డి అనే వ్య‌క్తి రాజ‌శేఖ‌ర్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్‌కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వ‌హించగా.. మాన‌సిక ఒత్తిడి వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అప్ప‌ట్లో జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌లు పోలీసుల‌కు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అప్పుడు రామిరెడ్డి కూడా ఇచ్చిన కేసు వాప‌సు తీసుకోవ‌డంతో వివాదం ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు