కరోనా వైరస్ మహమ్మారి లాక్ డౌన్ కారణంగా ప్రపంచ దేశాలన్నింటిని ఆర్ధిక పరిస్ధితి క్షీణించింది. లాక్ డౌన్ నుంచి బయటపడిన తరువాత దేశ ఆర్ధిక వ్యవస్ధను మెరుగుపరిచేందుకు ప్రయత్నంలో భాగంగా లండన్ ప్రభుత్వం ఒక కొత్త ప్రభుత్వ పథకాన్నికి మెుదలు పెట్టింది. ఎవరైతే రెస్టారెంట్లలో భోజనం చేస్తారో వారి బిల్లులో సగం అంటే 50 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని ఛాన్సలర్ రిషి సునక్ బుధవారం(జూలై 8,2020) ఒక ప్రకటనలో తెలిపారు.
దేశంలో కొన్ని ప్రాంతాల్లో మూడు నెలలకు పైగా మూసివేయబడిన రెస్టారెంట్, పబ్,బారులు తిరిగి ప్రారంభించబడ్డాయి. డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుగా వ్యాపారులు Gov.uk లో నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా పుడ్ స్టాండర్జ్స్ ఏజెన్సీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని సంబంధించిన మరిన్ని వివరాలను జూలై 13 విడుదల చేయబడతాయి. ఈ పథకం ఆగస్టు 3, 2020 నుంచి ప్రారంభమై ఆగస్టు 31, 2020 వరకు ఉంటుంది.
యాహూ ఫైనాన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకం వల్ల ప్రభుత్వం 500 నుంచి 629 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. కానీ దీని ద్వారా 1.8 మిలియన్ ఉద్యోగాలకు ఉపాది కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో ఆహారం, రెస్టారెంట్లపై 15 శాతం వ్యాట్ తగ్గించిన్నట్లు అవుతుందని ఛాన్సలర్ ప్రకటించారు. పన్ను శాతం 20 నుంచి 5 శాతానికి తగ్గుతుంది.