Encounter
Encounter : పాకిస్థాన్ దేశంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయని మిలిటరీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. సరోఘా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా నిఘా ఆధారిత ఆపరేషన్ నిర్వహించారు.
ALSO READ : Telangana Assembly Election 2023 : ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళిత, ఆదివాసీ ఓటర్లే కీలకం
ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటన స్థలంల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది. దేశం నుంచి ఉగ్రవాద ముప్పును తుడిచిపెట్టడంలో భాగంగా ఉగ్రవాదులను అంతమొందించడానికి ఆపరేషన్ జరుగుతోందని పాక్ ఆర్మీ పేర్కొంది.