Heat danger
Heat : ప్రపంచంలో 2050వ సంవత్సరం నాటికి అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఐదు రెట్లు ఎక్కువ మంది మరణిస్తారని అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం వెల్లడించింది. ప్రపంచంలో పెరుగుతున్న శిలాజ ఇంధనాల వినయోగంతో అధిక వేడి పరిస్థితులు మనుషుల మనుగడ, వారి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని ది లాన్సెట్ కౌంట్డౌన్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరవు పరిస్థితుల వల్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూ మరణిస్తారని నిపుణులు హెచ్చరించారు.
ALSO READ : Karnataka : పరీక్ష హాలులో బాలికలు హిజాబ్ ధరించడంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారంటే….
మునుపెన్నడూ లేనంతగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, దీనివల్ల పలు అంటువ్యాధులు ప్రబలుతాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. గత వారంలో యూరప్ ఖండంలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో పెరిగింది. మానవ చరిత్రలోనే ఈ సారి హాటెస్ట్ సంవత్సరంగా అంచనా వేశారు. గ్లోబల్ వార్మింగ్, అధిక ఉష్ణోగ్రతలపై ఈ నెలఖరులో దుబాయ్ దేశంలో కాప్ 28 వాతావరణ చర్చలు జరగనున్నాయి.
ALSO READ : Aishwarya Rai : ఐశ్వర్య రాయ్కు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు
ఈ ఏడాది డిసెంబర్ 3వతేదీన ఆరోగ్య దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయించారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 86 రోజులు ప్రాణాంతకమై అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 1991-2000 నుంచి 2013-2022 వ సంవత్సరం వరకు అధిక వేడి కారణంగా మరణించిన వారి సంఖ్య 85 శాతం పెరిగింది. భవిష్యత్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా మారతాయని లాన్సెట్ కౌంట్డౌన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెరీనా రోమనెల్లో వ్యాఖ్యానించారు.
శతాబ్దం చివరి నాటికి ప్రపంచం రెండు డిగ్రీల సెల్సియస్ మేర వాతావరణం వేడెక్కుతుందని పరిశోధకులు చెప్పారు. శతాబ్దం మధ్య నాటికి 520 మిలియన్ల మంది ప్రజలు ఆహార కొరత ఎదుర్కోనున్నారు. ప్రపంచంలో డెంగీ వ్యాధి 36 శాతం పెరుగుతుందని నిపుణులు చెప్పారు. వాతావరణ మార్పులతో పెద్ద సంక్షోభం ఏర్పడనుందని లాన్సెట్ కౌంట్డౌన్ కు చెందిన జార్జియానా గోర్డాన్-స్ట్రాచన్ చెప్పారు.
ALSO READ : IMD Issues Warning : బంగాళాఖాతంలో అల్పపీడనం…ఆంధ్రా మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరిక
గ్లోబల్ హీటింగ్ వల్ల ప్రాణాంతక తుపాన్ లు, కరవు పరిస్థితులు, పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలతో ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని జార్జియానా గోర్డాన్-స్ట్రాచన్ చెప్పారు. రాబోయే దశాబ్దాలలో ఐదు రెట్లు ఎక్కువ మంది ప్రజలు తీవ్రమైన వేడి కారణంగా చనిపోయే అవకాశం ఉందని పరిశోధకులు చెప్పడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. వాతావరణ మార్పులపై చర్య తీసుకోకపోతే మనుషుల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుందని అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం హెచ్చరించింది.