భారత్ మీదుగా పాక్ ప్రధాని విమానం
- venkaiahnaidu
- Published On : February 23, 2021 / 03:40 PM IST
India allows pakistam pm imran khan aircraft:భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానానికి అధికారులు అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంకలో తొలిసారి పర్యటించేందుకు ఇమ్రాన్ భారత గగనతలం మీదుగా వెళ్తున్నారు.
అయితే, 2019లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పాకిస్తాన్ గగనతలం మీదుగా సౌదీ వెళ్లేందుకు ఇమ్రాన్ సర్కార్ అనుమతివ్వని విషయం తెలిసిందే. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో అనుమతి ఇవ్వలేదని సాకుగా చెప్పింది.
ఈ విషయంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు భారత్ ఫిర్యాదు కూడా చేసింది. సాధారణంగా దేశాధినేతల విమానాలకు అన్ని దేశాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుంటాయి. కానీ మోడీ విమానానికి పాక్ అనుమతి నిరాకరించి నిబంధనలు ఉల్లంఘించింది.
