కరోనా సోకి.. 200 మంది సైనికులు మృతి!!

  • Publish Date - March 12, 2020 / 07:17 AM IST

కరోనా వైరస్ మహమ్మారికి ఉత్తర కొరియాలో దాదాపు 200 మంది సైనికులు చనిపోయారనీ..మరో 4వేల మంది కరోనా సోకినట్లుగా వార్తలు సంచలనం రేపుతున్నాయి.  దేశం మాత్రం ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించలేదు. కరోనా సోకింది అని తెలిసి ఆ వ్యక్తి ని కాల్చి చంపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత రెండు నెలల వ్యవధిలో దేశంలో 180 మందికి పైగా సైనికులు చనిపోయినట్లు దక్షిణ కొరియాకు చెందిన వార్తా సంస్థ డైలీ ఎన్కే ఒక కధనాన్ని ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం…ఉత్తర కొరియాలో జనవరి,ఫిబ్రవరి నెలల్లో కరోనా సోకి 180 మందికి పైగా సైనికులు చనిపోగా, 3,700 మందిని క్వారంటైన్ సెంటర్ లకు తరలించినట్లు పేర్కొంది. మృతి చెందిన సైనికుల్లో ఎక్కువగా చైనా సరిహద్దుల్లో డ్యూటీ చేసేవారేనని ఉత్తర కొరియా కు చెందిన మిలటరీ వైద్య అధికారి ఈ విషయాన్నీ బయటపెట్టినట్లు తన కధనంలో  డైలీ ఎన్‌కే పేర్కొంది. అయితే ఈ విషయంపై ఉత్తర కొరియా ఎలాంటి ప్రకటన చేయలేదని దక్షిణ కొరియా వార్తా సంస్థ ఈ కధనాన్ని ప్రచురించింది. జనవరి,ఫిబ్రవరి నెలల్లోనే ఇంతమంది చనిపోయారని,అయితే మార్చిలో కూడా మరిన్ని మరణాలు సంభవించి ఉండొచ్చు అని ఆ వార్తా సంస్థ అంచనావేస్తూ..అభిప్రాయపడింది.

అయితే ఇంత ప్రాణనష్టం జరుగుతున్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ఈ విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరకొరియాలోకి కరోనా ఎంటర్అయితే అధికారులందరినీ కాల్చి పడేస్తానంటూ కిమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ సైనికులకు కరోనా వచ్చిందనే విషయాన్ని బైటకు రానివ్వటంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

ఏది ఎలా ఉన్నా దేశంలో కరోనా ప్రబలకుండా చూడాలి అంటూ అధికారులను ఆదేశించారు కూడా. అయినప్పటికీ అక్కడ కరోనా ప్రబలుతున్నట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ కధనాల ద్వారా స్పష్టమౌతుంది. కానీ ఇప్పటివరకు సైనికుల మృతిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. మరి ఈ డైలీ ఎన్ కె కధనం పై కిమ్ ఎలా స్పందిస్తారో చూడాలి. స్పందిస్తే మాత్రం అది కచ్చితంగా కిమ్ స్టైల్లోనే ఉంటుంది. 
 

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తూ దేశ దేశాలకు పాకుతోంది.  చైనాలో మొదలెన కరోనా యావత్ ప్రపంచంలో అల్లకల్లోలం చేస్తోంది. చైనాలో కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. యూరప్ సహా పలు దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ కరోనావైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా 4300 మంది చనిపోయారు.

See Also | ఏపీలో కరోనా కలకలం… విశాఖ, కర్నూలులో అనుమానిత కేసులు