OceanGate : టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం జరిగి పట్టుమని 10 రోజులైనా గడవకముందే.. ఓషన్ గేట్ యాడ్స్!

OceanGate not stopped Titanic trips

OceanGate – Titanic trips : ఓషన్ గేట్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ (Titan submersible).. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన న్యూస్ ఇది. టైటాన్ ప్రమాదం తర్వాత ఓషన్ గేట్ సంస్థ.. అండర్ వాటర్ టూరిజంకు పుల్ స్టాప్ పెడుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ప్రమాదం జరిగి పట్టుమని పది రోజులైనా గడవకముందే.. టైటానిక్ శకలాలు (Titanic wreckage) చూసొద్దాం రండి అంటూ.. ఓషన్ గేట్ యాడ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. దాంతో.. టైటాన్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌ (Hot Topic)గా మారింది.

అమెరికాకు చెందిన అండర్‌ వాటర్‌ టూరిజం కంపెనీ ఓషన్‌గేట్‌ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న టైటాన్‌ సబ్‌ మెర్సిబుల్‌ విషాదం జరిగి.. పదిరోజులైనా గడవక ముందే.. టైటానిక్‌ శకలాలు చూద్దాం రండి అంటూ.. మళ్లీ యాడ్స్‌తో ఊదరగొడుతోంది. అట్లాంటిక్‌లో మునిగిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు.. ఇదే మా ఆహ్వానమంటూ ఓషన్‌గేట్‌ కంపెనీ ప్రకటనలిస్తోంది. ఓ వైపు టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలను బయటకు తీసుకురావడం.. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సోషల్‌ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఓషన్‌గేట్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్‌ 12వ తేదీ నుంచి జూన్‌ 20 మధ్య, అలాగే 2024 జూన్‌ 21 నుంచి జూన్‌ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్‌ చేసినట్లు ఓషన్‌గేట్‌ కంపెనీ ప్రకటనలిచ్చింది. టికెట్‌ ధరను 2 లక్షల 50 వేల డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్‌లోనా? వేరే ఏదైనా సబ్‌మెర్సిబుల్‌లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక.. సబ్‌ పైలట్‌ పొజిషన్‌ కోసం కూడా ఓషన్ గేట్ కంపెనీ ఓ యాడ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. టైటాన్‌ శకలాల గాలింపు సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోగా.. విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో.. ఆ జాబ్‌ యాడ్‌ను ఓషన్‌గేట్‌ తొలగించింది.

Also Read: టైటాన్ శిథిలాల నుండి బిలియనీర్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్న యూఎస్ కోస్ట్ గార్డ్

నిజానికి.. టైటాన్‌ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శలతో.. ఓషన్‌గేట్‌ సంస్థ ఇకపై ఇలాంటి టూర్‌లు నిర్వహించదని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో స్టాక్‌టన్‌ రష్‌ కూడా దుర్మరణం చెందారు. అయినప్పటికీ.. అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్‌ టూర్‌ను నిర్వహించేందుకు రెడీ కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనూ ఓషన్‌గేట్‌ టైటాన్‌ ప్రయాణంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read: టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడుకు కారణం.. కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ అంటే ఏమిటి?

సబ్‌ మెర్సిబుల్‌ నిర్మాణం అట్లాంటిక్‌ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదని.. నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. పైగా వీడియో గేమ్‌ల తరహా రిమోట్‌ కంట్రోల్‌తో టైటాన్‌ను కంట్రోల్‌ చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ టైటాన్‌తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ. ఇంత జరిగినా.. మళ్లీ టైటానిక్ చూసొద్దామంటూ ప్రకటనలివ్వడం.. హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు