Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మరణవార్తలపై వీడిన సస్పెన్స్.. పాక్ ఆర్మీ సంచలన ప్రకటన
ఇమ్రాన్ ఖాన్(Imran Khan) జైలులోనే ప్రాణాలు కోల్పోయారంటూ ఒక పాకిస్థానీ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించాయి.
- V Santhosh Kumar
- Updated on- August 12, 2026 / 07:29 PM IST
Pakistan journalist claims ex pm imran khan died in jail
- ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారు.
- ఆర్మీ స్పష్టతతో తీరిన ఉత్కంఠ.
- కుటుంబ భేటీకి పీటీఐ పట్టు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించారంటూ సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలు ఆ దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో పీటీఐ శ్రేణులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైనిక సమాచార విభాగం ఎట్టకేలకు మౌనం వీడి స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు నివేదికలని, ఆయన క్షేమంగానే ఉన్నారని ఆర్మీ స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ వజాహత్ ఖాన్ వెల్లడించారు.
RC Transfer: మీ బండిని అమ్మేశారా?.. ఆర్సీ మార్చకపోతే పోలీస్ కేసే.. ఆర్టీఓ కొత్త రూల్స్ ఇవే!
ఆర్మీ ప్రకటనపై జర్నలిస్ట్ వజాహత్ ఖాన్ విశ్లేషణ:
ISPR స్పందనపై వజాహత్ ఖాన్ తాజా వీడియోలో స్పందిస్తూ.. సైన్యం తన కథనాన్ని ‘ఫేక్’ అని కొట్టిపారేసినప్పటికీ, ఆర్మీ ప్రకటన ద్వారా ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారనే నిజం బయటకు రావడం ఊరటనిచ్చే అంశమని తెలిపారు. GHQ లోని ముగ్గురు సీనియర్ అధికారులు కేవలం తమ ఆందోళనను మాత్రమే పంచుకున్నారని, మరణాన్ని ధ్రువీకరించలేదని స్పష్టం చేశారు. ఆర్మీ అసాధారణంగా మౌనంగా ఉండటమే ఈ అనుమానాలకు కారణమైందని, తమ ఒత్తిడి వల్లే ప్రభుత్వం, సైన్యం స్పందించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.
కుటుంబ భేటీ కోసం పీటీఐ పట్టుబట్టడం
ఆర్మీ ప్రకటనతో కొంత స్పష్టత వచ్చినప్పటికీ, 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పీటీఐ పార్టీ అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. జైలులో ఉన్న ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులను, వ్యక్తిగత వైద్యులను వెంటనే అనుమతించాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది. ముఖాముఖి భేటీకి అనుమతి ఇచ్చి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి పారదర్శకత చూపించే వరకు తమ ఆందోళనలు ఆపబోమని పార్టీ స్పష్టం చేసింది.
