Plane crash : బ్రెజిల్ దేశంలో కూలిన విమానం…12 మంది మృతి
బ్రెజిల్ దేశంలో చిన్న విమానం కుప్పకూలి పోయింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మరణించారు. ఎకర్ రాష్ట్ర రాజధాని రియో బ్రాంకోలోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో చిన్న విమానం కూలిపోయిందని గవర్నరు గ్లాడ్సన్ కామెలీ చెప్పారు....
- saleem sk
- Published On : October 30, 2023 / 06:25 AM IST
Plane crash
Plane crash : బ్రెజిల్ దేశంలో చిన్న విమానం కుప్పకూలి పోయింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మరణించారు. ఎకర్ రాష్ట్ర రాజధాని రియో బ్రాంకోలోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో చిన్న విమానం కూలిపోయిందని గవర్నరు గ్లాడ్సన్ కామెలీ చెప్పారు. బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మరణించారని గవర్నర్ గ్లాడ్సన్ చెప్పారు.
Also Read : Vizianagaram Train Accident : 12 రైళ్లు రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు
సోషల్ మీడియాలో క్రాష్ సైట్ యొక్క వీడియో అడవిలో మండుతున్న శిధిలాలను చూపించింది. ఈ విమాన ప్రమాదంలో ఒక శిశువు కూడా మరణించారు. సింగిల్ ఇంజిన్ సెస్నా కారవాన్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రియో బ్రాంకోలోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో కుప్పకూలి పోయింది. 9 మంది పెద్దలు, ఒక శిశువుతో సహా పది మంది ప్రయాణికులు,పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే మరణించారని ప్రకటన పేర్కొంది.
Also Read : Vizianagaram Train Accident : రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే..
కూలిపోయిన విమానం వద్ద పెరూ బొలీవియాతో బ్రెజిల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మారుమూల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. చాలా మంది ప్రయాణికులు వైద్యసేవలు పొందిన తర్వాత పొరుగున ఉన్న అమెజాన్ రాష్ట్రానికి తిరిగి వస్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది. సెప్టెంబరు నెలలో అమెజానాస్ పట్టణంలోని బార్సెలోస్లో తుపాను సమయంలో విమానం ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కూలిపోయి 14 మంది మరణించారు.
