Droupadi Murmu: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

బ్రిటన్‌లో జరగబోయే క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియలకు బ్రిటన్ అధికారికంగా భారత్‌కు ఆహ్వానం పంపింది.

Droupadi Murmu: బ్రిటన్‌లో జరగనున్న క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ నెల 8న మరణించిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వచ్చే సోమవారం (సెప్టెంబర్ 19) జరగనున్న సంగతి తెలిసిందే.

Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు ప్రపంచ దేశాలకు బ్రిటన్ ఆహ్వానం పంపింది. మయన్మార్, రష్యా, బెలారస్ మినహా అన్ని దేశాలు అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నాయి. భారత్‌కు కూడా అధికారికంగా ఆహ్వానం అందింది. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా హాజరవుతారు. ఆమె ఈ నెల 17న లండన్ బయల్దేరి వెళ్తారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత ఇండియా తిరిగొస్తారు.

J&Ks Poonch: జమ్మూలో లోయలో పడ్డ బస్సు.. 12 మంది మృతి.. 25 మందికి గాయాలు

ఇప్పటికే క్వీన్ ఎలిజబెత్ మరణంపై భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఆదివారం మన దేశంలో సంతాప దినంగా కూడా పాటించారు.

 

ట్రెండింగ్ వార్తలు