కరోనా నివారణకు మందు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు శాయశక్తులా కష్టపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఏ మందు కూడా కరోనా నివరణకు ఉపయోగపడట్లేదు. ఇప్పటికే ఉన్న కొన్ని మందులుతోనే డాక్టర్లు COVID-19తో పోరాడుతున్నారు.
ఇదిలా ఉంటే కరోనావైరస్ వివిధ కణ వ్యవస్థలను నాశనం చేయకుండా నిరోధించేందుకు అలెర్జీలతో సహా పలు రకాల ఔషధాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అయితే COVID -19 చికిత్సకు ఉపయోగించిన ఓ ఔషదం కోవిడ్-19 రోగాన్ని మరింత బలంగా చేస్తుందని నిపుణులు గుర్తించారు.
కోతుల మీద ప్రయోగించిన ఓ సాధారణ దగ్గు ఔషదం కోతి కణాలలో వైరస్ పెరుగుదలను ప్రేరేపించిందని గుర్తించారు నిపుణులు. దగ్గు మందులలో ఒక సాధారణ పదార్ధం, dextromethorphan, కోతి కణాలలో SARS-CoV-2 వైరస్ పెరుగుదలను ప్రేరేపించినట్లు గుర్తించారు. పరిశోధకులు ఏప్రిల్ 30న ఈ విషయాన్ని నివేదించారు.dextromethorphan సెల్యులార్ స్ట్రెస్-కోపింగ్ ప్రాసెస్ను యాక్టివేట్ చేసినట్లు అనిపిస్తుందని, ఇది వైరస్ పెంచుతున్నదని శాస్త్రవేత్తలు చెప్పారు.
అయితే University of California, San Francisco School of Pharmacy విశ్వవిద్యాలయానికి చెందిన బ్రియాన్ షోయిచెట్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ dextromethorphan తీసుకోవడం మానేయాలని మేము సిఫారసు చేయట్లేదని చెప్పారు.
మాములుగా కూడా దగ్గును అణిచివేసే మందులు నాడీ వ్యవస్థ మీద పనిచేసి మలబద్ధకం మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దగ్గు మందులతో మగత, అలసట వంటి సమస్యలు రావచ్చునని, దగ్గుమందులు తీసుకున్న తర్వాత మత్తుగా కూడా ఉంటుదనే నివేదికలు ఉన్నాయి.
See Also | కరోనాకు రెమెడెసివర్ కరెక్ట్ మెడిసిన్ అంటోన్న గిలీద్..