Why America is trying to modernise new nuclear bomb
US nuclear bomb: పేరులో అణువు ఉన్న ఆ బాంబు అణువణువునూ నాశనం చేస్తుంది. అదే అణు బాంబు. హిరోషిమా-నాగసాకి ఘటన తర్వాత న్యూక్లియర్ వెపన్ అంటే చాలు ఏ దేశమైనా భయపడిపోవాల్సిందే. అయినా సరే.. ఏ దేశానికదే అణ్వాయుధాలు తయారు చేసుకుంటూ తమ అమ్ముల పొదిలో దాచుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా న్యూక్లియర్ బాంబులాంటి వార్తే పేల్చింది. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో వినియోగించిన అణు బాంబు కంటే 24 రెట్లు శక్తిమంతమైన న్యూక్లియర్ వెపన్ను తయారు చేస్తున్నట్లు పెంటగాన్ ప్రకటించడం కలకం రేపుతోంది.
ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టించే వార్త చెప్పింది అమెరికా. న్యూక్లియర్ వెపన్స్ను పెంచుకుంటూ పోతున్న అగ్రరాజ్యం.. అతిపెద్ద అణు బాంబును తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లోని హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రెట్లు శక్తిమంతమైన న్యూక్లియర్ బాంబ్ను తయారు చేస్తోంది. ఇప్పటికే అమెరికా వద్ద 5 వేల 550కిపైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అణు బాంబుల సంఖ్యను మరింతగా పెంచుకుంటూ పోతున్న ఈ దేశం.. 2030 నాటికి వెయ్యి న్యూక్లియర్ బాంబులను సమకూర్చుకోనుంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ స్వయంగా ప్రకటించింది.
అమెరికాలోని నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ తయారు చేస్తున్న ఈ అణుబాంబుకు B 61-13 అని పేరు పెట్టారు. వార్ జెట్స్ ద్వారా ప్రయోగించే ఈ అణు బాంబులు.. గ్రావిటీ పవర్ సాయంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. అమెరికా తయారు చేస్తున్న తాజా బాంబు ఏకంగా 360 కిలోటన్నుల శక్తిని విడుదల చేస్తుంది. అయితే.. దీనికి తయారీకి అమెరికా కాంగ్రెస్ ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది.
Also Read: హమాస్ అమ్ముల పొదిలో కొత్త సబ్ మెరైన్ డ్రోన్ ఆయుధం ‘టార్పెడో’
సాధారణంగా అణు బాంబుల శక్తిని కిలోటన్నులతో పోలుస్తారు. వంద కిలోటన్నుల న్యూక్లియర్ బాంబు పేలితే దాని ప్రభావం దాదాపు 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 5 కిలోమీటర్ల వరకు భారీ నష్టం జరిగితే.. దాదాపు 2 కిలోమీటర్ల పరిధి మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. రెండో వరల్డ్ వార్ సమయంలో హిరోషిమాపై 15 కిలోటన్నుల శక్తి ఉన్న అణుబాంబు వేస్తే.. నాగసాకిపై పడ్డ బాంబు 23 కిలోటన్నుల శక్తిని విడుదల చేసింది. ఇప్పుడు అమెరికా ఏకంగా 360 కిలోటన్నుల శక్తిని విడుదల చేస్తుందని చెబుతున్నారు.
Also Read: 8 ఏళ్ల పిల్లాడ్ని తెచ్చుకుని పెంచి పెళ్లి చేసుకున్న మహిళ.. ఎలాగో తెలుసా?
ప్రస్తుతం ప్రపంచంలోకి చాలా చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తైవాన్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. యుద్ధ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నరగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు మొదలైంది. ఈ పోరు కాస్తా.. చుట్టుపక్కల దేశాల నుంచి అమెరికా రంగంలోకి దిగే వరకు వెళ్లింది. ఈ సమయంలో అమెరికా న్యూక్లియర్ వెపన్స్ పెంచుకుంటున్నట్లు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.