Rajnath Singh If Harmed, India Won't Spare Anyone Rajnath Singh's Message To China
Agnipath: దేశంలో త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కాసేపట్లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అగ్నిపథ్ పథకం కింద కేవలం నాలుగేళ్ళు మాత్రమే సర్వీసులోకి తీసుకోవడం ఏంటని, దీని వల్ల తాము నష్టపోతామని దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే.
agnipath: సికింద్రాబాద్లో పలు రైళ్ళు రద్దు.. హింస ఘటనలో దర్యాప్తు ముమ్మరం
దేశంలోని పలు రాష్ట్రాల్లో వందలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పలు రైల్వే స్టేషన్లలో ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. శనివారం కూడా పంజాబ్లోని లుధియానా రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. మరికొన్ని రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలోనూ ఇటువంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులను శాంతింపజేసేలా రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారుల నుంచి సలహాలు తీసుకునే అవకాశం ఉంది.