Balakrishna at Mahesh Babu's House to pay Tributes Indira Devi garu
Balakrishna: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ఆమె మృతిపట్ల మహేష్ బాబు అండ్ ఫ్యామిలీకీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సంగతి తెలిసిందే.
Balakrishna : నా అభిమానుల కోసమే ఈ షో.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కూడా వస్తారు.. కానీ
తాజాగా నందమూరి బాలకృష్ణ.. తల్లిని కోల్పోయిన మహేష్ బాబును ఓదార్చడానికి నేడు అతని ఇంటికి చేరుకున్నాడు. ఇందిరా దేవి గారి మరణం తరవాత మహేష్ బాబుని కలవలేకపోయాడు. కాగా నేడు ఘట్టమనేని కుటుంబం ఆమె సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కారిక్రమానికి బాలకృష్ణతో పాటు అడవి శేషు వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
దీంతో నేడు మహేష్ ని కలిసి బాలకృష్ణ పరామర్శించారు. ఇందుకు సంబంధిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.అలాగే ఇందిరాదేవి స్వస్థలం బుర్రిపాలెంలో అక్టోబర్ 16వ తేదీన బంధువులు, ఘట్టమనేని అభిమానుల సమక్షంలో సంతాప సభ నిర్వహించేందుకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Balakrishna at Mahesh Babu’s House to pay Tributes Indira Devi garu Pic2
Balakrishna at Mahesh Babu’s House to pay Tributes Indira Devi garu Pic1