Asaduddin Owaisi: కాశ్మీరి పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫలమైంది ..
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆపిల్ తోటలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్న వారిలో ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులను వేరుచేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
- Harishth Thanniru
- Published On : August 17, 2022 / 08:45 AM IST
Asaduddin Owaisi
Asaduddin Owaisi: జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆపిల్ తోటలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్న వారిలో ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులను వేరుచేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శోపియా జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోయలోని కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం ఆధ్వర్యంలోని యంత్రాంగం విఫలమైందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
Kashmiri Pandits: కశ్మీరీ పండిట్లను సురక్షిత ప్రాంతాలకు తరలింపు!
పండిట్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, ప్రభుత్వం వారికి భద్రత కల్పించడంలో విఫలమైనందున పండిట్లు ఇప్పుడు అభద్రతా భావంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రంలోని ప్రభుత్వం ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన అక్కడ నడుస్తుందని, అవి విజయవంతం కాలేదని రుజువైందని పండిట్లతో రుజువవుతోందని ఓవైసీ అన్నారు.
Kashmiri Pandit teachers: కేంద్రం కీలక నిర్ణయం.. అక్కడ పనిచేసే 177 మంది టీచర్ల బదిలీ..
2002 గోద్రా అల్లర్ల అనంతర బిల్కిస్ బానో కేసులో అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని విడుదల చేయడాన్ని ఖండించిన ఒవైసీ.. ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళా సాధికారత గురించి మాట్లాడారని, అయితే దోషుల విడుదలతో ఏమి ఉదాహరణ ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అమృత్ ఉత్సవ్కు ఎలాంటి ఉదాహరణ ఇస్తున్నారని ప్రశ్నించారు. నాథూరామ్ గాడ్సే ఫోటోతో ‘తిరంగా యాత్ర’ చేపట్టడంపై ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై ఓవైసీ మండిపడ్డారు. గాడ్సేకి మద్దతుగా చేపట్టిన ఊరేగింపు యోగి ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. గుండెల్లో గాడ్సేపై ప్రేమ, నాలుకపై గాంధీ పేరు అంటూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శించారు.
